ఏపనైనా కాంటా్రక్టే అనేటంతగా చేనుకీ రైతుకీ రైతుకూలీకీ మధ్య జీవనవిధానం రూపాయల బంధంగా మారిపోయింది. కోతకోసి, పనలుకట్టి, కుప్పవేసి, నూర్చి, తూర్పారబట్టి, సంచులకెత్తి, ధాన్యాన్ని ఒబ్బిడి చేసే పనుల్లో శ్రీకాకుళం జిల్లానుంచి వచ్చిన కూలీలే ఎక్కువగా వున్నారు. ఇతరవ్యాపకాలకు తరలిపోతూండటంవల్ల గోదావరి తూర్పు డెల్టాలో వ్యవసాయకూలీల కొరత ఏటేటా పెరిగిపోతోంది.
దాదాపు ఐదులక్షల ఎకరాల్లో వేసిననాట్లలో జూలైవానలకు నలభైశాతం పోతే మళ్ళీవేశారు, ‘నెలతక్కువపైరు’ లో 60 శాతం సెప్టంబరు వానలకు కుళ్ళిపోయింది.అప్పుడు మిగిలిన పైరు పంటై ఇపుడుకోతకు వచ్చింది. 1030 రూపాయల మద్ధతు ధర ప్రకటించినా 730 కి మించి ధర రైతుచేతి కందడమే లేదు.